ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాభై గంటల్లో....350 కిలోమీటర్ల పురుగు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 09:39 PM

ఆశయం ఎందాయకైనా మనిషిని పరిగెట్టిస్తుంది. ఇటీవల ప్రదీప్ మెహ్రా అనే కుర్రాడు ఆర్మీలో చేరేందుకు ప్రతి రోజూ రాత్రివేళ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల మేర పరుగు ప్రాక్టీసు చేయడం తెలిసిందే. ఆ కుర్రాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పుడలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రాజస్థాన్ లోని సికర్ కు చెందిన ఓ యువకుడు 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన వైనం అచ్చెరువొందిస్తోంది. 


24 ఏళ్ల ఆ యువకుడి పేరు సురేశ్ భిచార్. స్వస్థలం రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా. భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలన్నది అతడి ఆశయం. రాజస్థాన్ లోని సికర్ నుంచి ఢిల్లీ చేరుకున్న అతడిని మీడియా పలకరించింది. తమ ప్రాంతంలో అనేకమంది సైన్యంలో చేరాలని తపిస్తుంటారని తెలిపాడు. కానీ, రెండేళ్లుగా రిక్రూట్ మెంట్లు లేవని, తమ ప్రాంతంలో అనేక మంది యువత వయసు దాటిపోతోందని ఆ యువకుడు వెల్లడించాడు. అయితే యువతలో సైన్యం పట్ల ఆసక్తి తరిగిపోకుండా ఉండేందుకు ఇలా మారథాన్ పరుగు చేపట్టినట్టు వివరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa