ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న ఒమిక్రాన్ ఎక్స్ఈ వెరియంట్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ ఎక్స్ఈగా పిలుస్తున్న ఈ వేరియంట్కు సంబంధించిన తొలి కేసు మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం నాడు వెలుగు చూసింది. బ్రిటన్లో జనవరి 19న ఈ వేరియంట్ తొలి కేసు నమోదు కాగా.. తాజాగా భారత్లోనూ బుధవారం ఈ వేరియంట్కు చెందిన తొలి కేసు నమోదైంది. కరోనా కొత్త వేరియంట్ కేసు నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. కొత్త వేరియంట్పై అధ్యయనం జరుగుతోందన్న కేంద్ర ప్రభుత్వం ఈ వేరియంట్కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa