ఇప్పటివరకు గృహాలకు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అనధికారికంగా అమలవుతున్న విద్యుత్ కోతలు శుక్రవారం నుంచి అధికారికంగా అమలు కాబోతున్నాయి. దీనిపై ఏపీ ఈపీడీసీఎల్ గురువారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత వున్న నేపథ్యంలో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 24/7 సరఫరా ఇస్తూ పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు ‘ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్)’ అమలు చేయనున్నట్టు సీఎండీ సంతోషరావు తెలిపారు.
నిరంతరాయంగా నడిచే పరిశ్రమలన్నీ వారి విద్యుత్ డిమాండ్లో 50 శాతం మాత్రమే వినియోగించాలి. వారికి 24/7 సరఫరా ఉంటుంది. కానీ పూర్తి సామర్థ్యంతో పరిశ్రమను నడపకూడదు. రోజూ వినియోగించే విద్యుత్లో సగమే వినియోగించుకోవాలి. ఇతర పరిశ్రమలు వారానికి ప్రస్తుతం ఇస్తున్న ఒక రోజు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించాలి. అంటే వారానికి ఐదు రోజులే పనిచేయాలి. అంతేకాకుండా ఆ పరిశ్రమలన్నీ కేవలం ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేయాలి. సాయంత్రం ఆరు గంటల తరువాత పనిచేయడానికి వీల్లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రోజుకు ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించుకోవాలి.
ఏ జిల్లాకు ఎప్పుడు సెలవంటే..?
శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు సోమవారం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో మంగళవారం పూర్తిగా సెలవు ఇవ్వాలి. విశాఖ జిల్లాలో అనకాపల్లి సబ్ డివిజన్లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, ఎలమంచిలి సబ్ డివిజన్లకు గురువారం జోన్-2 డివిజన్కు శుక్రవారం, జోన్-1, జోన్-3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లకు శనివారం సెలవు ప్రకటించారు.జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్మాల్స్ కేవలం సగం ఏసీలను మాత్రమే వాడాలి. ఎన్నివుంటే అన్నింటిని వినియోగించడానికి లేదు. వ్యాపార ప్రకటనల కోసం ఏర్పాటుచేసిన హోర్డింగ్స్, సైన్ బోర్డులను సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వినియోగించకూడదు.22వ తేదీ వరకు ఈఎల్ఆర్ అమలుకె.సంతోషరావుఈపీడీసీఎల్ పరిధిలో ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్ను ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అమలు చేస్తున్నాం. ఆ తరువాత పరిస్థితులను బట్టి మార్పులు, కొనసాగింపు ఉంటుంది. విద్యుత్ కొరత తీవ్రంగా వున్న నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని కోరుతున్నాము.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa