ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న ఇల్లు కాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 01:37 PM

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తున్నాం అని ఆర్భాటాలు చేస్తూ ప్రజలని మోసం చేస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. కేంద్రం ఇస్తున్న నిధులను తమ పేరుతో చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించాలి అని పిలుపునిచ్చారు. ఈ రోజు పార్వతీపురంలో నిర్మిస్తున్న గృహాల సముదాయాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు రాష్ట్రా బీజేపీ నాయకులూ సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  కేంద్రం 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా విఫలమైన ఈ రాష్ట్ర పాలకులను అసమర్థ ప్రభుత్వం కాక ఇంకేమనాలి?  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే నిధులకు వైసిపి రంగులు  పులుముకోవడం తప్ప చిత్తశుద్ధితో చేసే అభివృద్ధి పని ఒక్కటి కూడా రాష్ట్రంలో కనిపించడం లేదు అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa