ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్‌పై లోకేష్ దూమారం రేపే వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 05:47 PM

తనపై టీడీపీ, జనసేన ఎంత బురద జల్లినా తననేమీ చేయలేరని ఏపీ సీఎం జగన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ప్రతిపక్షాలు తన వెంట్రుక కూడా పీకలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. "గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు.

మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పని చేస్తున్నాం. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం. ప్రజలే పీకుతారు.. కొంచెం ఓపిక పట్టు" అంటూ వరుస ట్వీట్లు పెట్టారు. వేళాపాలా లేకుండా పవర్ కట్‌లతో ఏపీలో అంధకారం నెలకొందని, జగన్‌కు పవర్(అధికారం) పోతే ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa