ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా వెంట్రుక కూడా పీకలేరు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 06:50 PM

ఏపీలోని నంద్యాల బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతుంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు అసూయ కలుగుతుందని ఆరోపించారు. అసూయను తగ్గించుకోకపోతే బీపీ, గుండెపోటు వచ్చి టికెట్‌ తీసుకుంటారని వ్యాఖ్యనించారు. రెండో విడత జగనన్న వసతి దీవెన కింద 10లక్షల 68 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లను సీఎం జగన్‌ జమ చేశారు.

రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని సీఎం జగన్ అన్నారు.పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెనను ప్రారంభించామన్నారు. పేదలకయ్యే ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా అందజేసి తల్లిదండ్రులను ఆదుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్‌ మీడియంగా మార్చే కార్యక్రమం జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు రానున్నాయని అన్నారు. స్కీల్‌ డెవలప్‌మెంట్‌ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని వివరించారు. విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 8.64శాతం పెరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa