కర్లపాలెం మండలంలోని కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని వ్యవసాయ అధికారి అద్దంకి శివ పార్వతి పేర్కొన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం లో శుక్రవారం మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ సెంటు భూమి కూడా లేకుండా కౌలు సాగుచేసే రైతులుని గుర్తించడానికి గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమం జరుతుందని చెప్పారు. సున్నా వడ్డీ పంట రుణాలు కింద లోన్ తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే ఏడాది కాలంలోపు లోన్ అమౌంట్ ని చెల్లించి వడ్డీ రుణమాఫీకి అర్హులు కావాలన్నారు.
వ్యవసాయ ఇతర అనుబంధ శాఖల వారు కూడా ఈ కార్యక్రమంలో వారి శాఖల గురించి రైతులుకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు జడ్పీటిసి పిట్ల. వేణుగోపాల్ రెడ్డి , ఎంపీపీ యారం. వనజ , డిప్యూటీ తహశీల్దార్ పి. సాంబశివరావు, గ్రామ మత్స్య శాఖ సహాయకులు షేక్. సద్దాం హుస్సేన్ , వెటర్నరీ అధికారి రేచల్ దివ్య , వ్యవసాయ విస్తరణ అధికారి కె. భాగ్యలక్ష్మి మండల అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa