ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భిణుల్లో రక్తహీనత నిర్మూలనకు అవగాహన

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 08:07 PM

అంగన్వాడీ కేంద్రాలలో కొనసాగుతున్న పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భవతులు, బాలింతలలో రక్తహీనతపై ఐసిడిఎస్ సూపర్ వైజర్ అబ్దుల్ సలీమ్ మున్నీసా అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేసారు. మొవ్వ మండల పరిధిలోని ముత్రాసుపాలెం అంగన్వాడీ కేంద్రంలో నిర్వ హించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం మూలంగా పెదాలు తెల్లగా పాలిపోవడం, గోళ్లు, చిగుళ్లు తెల్లగా ఉండటం, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాస పడటం ఇలాంటి లక్షణాలు కనబడితే దానిని ఎనీమియాగా గుర్తించాలని సూచించారు. నివారణకు ఆకుకూరలు, పప్పులు, కోడిగుడ్లు, చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అదే విధంగా పాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. అలాగే రక్తహీనతకు గురైన గర్భవతులు, బాలింతలు, తల్లులు, పిల్లలు సత్వరం వైద్యులను కలిసి వైద్య సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త జె. చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa