ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేడియంలో తగ్గిపోయిన అభిమానుల సంఖ్య: బీసీసీఐ కు షాక్

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 04:24 PM

ఒకపుడు ఐపీఎల్  మ్యాచ్ లు అంటే స్టేడియంలో కూర్చొనేందుకు సీట్లు దొరకడం కష్టంగా ఉండేది. ఇపుడు  పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ బీసీసీఐకి షాక్ ఇస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో 2023-2027 ప్రసార హక్కులకు భారీ బిడ్డింగ్ వస్తుందనే యోచనలో ఉన్న బీసీసీఐకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అమెజాన్, సోనీ, టీవీ 18 వయాకామ్, డిస్నీ స్టార్ సంస్థలు ఇప్పటి వరకు టెండర్ పత్రాలను కొనుగోలు చేశాయి. ఆటగాళ్లు ఒక టీమ్ నుంచి మరొక టీమ్ కు మారిపోవడం... ఈ ఏడాది జట్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు ఆటగాళ్ల ఆసక్తిని తగ్గించాయి. మ్యాచ్ లు చూడాలన్న ఆసక్తి కలగడం లేదని పలువురు క్రికెట్ అభిమానులు చెపుతున్నారు. కోహ్లీ, ధోనీలు కెప్టెన్లుగా లేకపోవడం కూడా అభిమానుల ఆసక్తి తగ్గడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో, టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయింది. గత ఏడాదితో పోల్చుకుంటే తొలివారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్ నివేదిక ప్రకారం గత ఏడాది తొలి 8 మ్యాచ్ లకు 3.75 శాతం రేటింగ్ రాగా.. ఈ ఏడాది 2.52 శాతానికే పరిమితమయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa