ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి బాలినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 03:30 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అధికార పార్టీ వైసీపీలో ఆగ్రహ జ్వాలలు రాజేస్తోంది. మంత్రి పదవి దక్కని, కొనసాగింపులో లేని నాయకులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఒంగోలు జిల్లాలో గత కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించి, తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తన అనుచరులకు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆదివారం రెండుసార్లు ఆయనను కలిసి, సంప్రదింపులు జరిపారు. ఇక మరో మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా మంత్రి పదవి దక్కకపోవడంపై కినుక వహించారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలకు తన రాజీనామా పత్రాన్ని ఇవ్వడం దుమారం రేపింది. మంత్రి పదవి వస్తుందనే అంచనాలున్నా, తనకు పదవి దక్కకపోవడంపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా అలిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఆయన కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa