ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

national |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 05:47 PM

కొందరు పెళ్లి చేసుకుని, వివాహ బంధానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. చివరికి తప్పు గ్రహించేలోపే జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. అనుకున్నది జరగకపోవడంతో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడితే, మరికొందరు అవతలి వారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇదే కోవలో భార్యను వదిలి ప్రియురాలి వెంట ఓ వ్యక్తి పడ్డాడు. పెళ్లికి ఆమె నిరాకరించడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రాజస్థాన్‌లో పాలి జిల్లాకు చెందిన ఛగన్ లాల్ బంజారా (30) అనే వ్యక్తికి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అదే గ్రామంలో వివాహిత మమత(23)పై ఆయన మనసుపడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్య పిల్లలను వదలేశాడు. ఐదేళ్లుగా వారి మధ్య సంబంధం కొనసాగుతోంది. పెళ్లి చేసుకుందామని ఛగన్‌లాల్ అడిగినా, మమత నిరాకరిస్తూ వస్తోంది. ఏప్రిల్ 1న మరోసారి ఆమె ఇంటికి వెళ్లి ఛగన్ లాల్ గొడవ పడ్డాడు. అనవసరంగా భార్య పిల్లలను కూడా వదిలేశానని వాపోయాడు. కోపంలో గన్ బయటకు తీసి మమతను కాల్చేశాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. తీవ్రగాయాలతో మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 8న మరణించింది. ఇక ఛగన్‌లాల్ ఏప్రిల్ 9న ఆసుపత్రిలో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa