కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప లంచం డిమాండ్ చేశారని ఆరోపించిన ఓ కాంట్రాక్టర్ మంగళవారం ఉడిపిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించాడు.భారతీయ జనతా పార్టీకి చెందిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ విషపూరిత పదార్థం తిని మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను ఏప్రిల్ 11న తన స్నేహితులతో కలిసి శాంభవి లాడ్జికి వెళ్ళాడు . మరుసటి రోజు ఉదయం గదిని తెరిచినప్పుడు,అతను శవమై కనిపించాడు అని తెలిపారు. గత నెలలో కాంట్రాక్టర్ ఒక ఛానల్ లో మాట్లాడుతూ ఈశ్వరప్ప ఒక ప్రాజెక్ట్లో 40% లంచం డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈశ్వరప్ప ఇచ్చిన మౌఖిక హామీ మేరకు పాటిల్ హిండల్గాలో రోడ్డు పనులను ప్రారంభించారు."కానీ వర్క్ ఆర్డర్ పెంచబడలేదు లేదా చెల్లింపు విడుదల కాలేదు" అని తెలిపాడు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.మరోవైపు ఈశ్వరప్పను అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa