ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారికి హైకోర్టు షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 03:38 PM

ఏపీ సీనియర్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల కోర్టు న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని శ్రీలక్ష్మితో సహా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను నిర్లక్ష్యం చేశారని వారికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. అయితే అధికారులంతా న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. దీంతో అధికారులకు విధించిన శిక్షలో అత్యున్నత ధర్మాసనం మార్పు చేసింది.


ఎస్టీ, బీసీ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను ఏడాదిలో నెలకోసారి ఆదివారం వెళ్లి సందర్శించాలని, విద్యార్థులతో కొంత సేపు ముచ్చటించాలని సూచించింది. దానికి కూడా మినహాయింపు ఇవ్వాలని, శిక్షను పున:పరిశీలించాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టి వేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa