జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నిన్న అనంతపురం జిల్లాలో ప్రారంభమైందని, ఈ యాత్ర లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , పియసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారని, నిన్న 30 రైతు కుటుంబాలను పరామర్శించి 30 లక్షల రూపాయలు చెక్ లను అందజేయడం జరిగిందన్నారు. అలాగే వారి పిల్లల బాధ్యత కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశ్శంకరావు శ్రీనివాసరావు తెలియజేశారు.
కారంపూడి రోడ్ లోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రం లో ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారని, ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తారని, పవన్ కళ్యాణ్ సొంత సంపాదన నుండి 5 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారని తెలియజేశారు. ప్రభుత్వం తీర్చాల్సిన ప్రజా సమస్యల్ని జనసేన పార్టీ తీరుస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రైతు భరోసా యాత్ర అని అన్నారు. ప్రజల తరపున పోరాడుతున్న జనసేన పార్టీ కి ప్రజలు అండగా ఉండాలన్నారు. త్వరలో ఈ యాత్ర గుంటూరు జిల్లా లో జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో అడపాల అనీల్, సాల్మన్ రాజు, ఆసా మనోహర్, వేముల అనీల్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa