ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 04:29 PM

శాసనాలు చేసే శాసనసభలో వామపక్షాల ఎమ్యెల్యే లు లేకపోవడం రాష్ట్రానికి పట్టిన దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. వినుకొండ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ప్రజల బాధలు పట్టలేదని అధికారమే పరమావధిగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. ధరల పెరుగుదలపై ప్రచార ఆందోళన కార్యక్రమంలో పాల్గొని రెండు ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ ట్రాక్టర్ ను లాగించుతూ పట్టణంలోని ప్రధాన రోడ్లలో ప్రచారం చేస్తూ అక్కడక్కడ గ్రూప్ మీటింగులు నిర్వహిస్తూ ఆయిల్ ధరల, కరెంటు చార్జీల పెరుగుదల పై నిరసన తెలియజేశారు.

కరోనాతో పేద ప్రజలు అల్లాడిపోయి బ్రతుకు జీవుడా అని బట్టకట్టి కాలం గడుపుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ సండ్ర పాటి సైదా, సహాయ కార్యదర్శులు బూదాల శ్రీనివాసరావు, ఉలవల పూడి రాము, పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, బూదాల చిన్న, కొండ్రముట్ల చిన సుభాని, షేక్ మస్తాన్, కొప్పరపు మల్లికార్జున, సోమవారపు దావీదు, దూపాటి మార్కు, ఆంజనేయులు, రమణయ్య, నల్లబోతుల శ్రీను, సాంబయ్య, తిరుమల శ్రీను, రోశయ్య, పెద్దిటి ప్రసాద్, పిట్టంబండ ఎక్కువ సంఖ్యలో పేద ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa