ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్విచక్ర వాహనం బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 04:52 PM

అనంతపురం: కంబదూర్ మండల పరిధిలోని ములకనూరు గేట్ దగ్గర ద్విచక్ర వాహనం బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిల్లలపల్లిలో నూతనంగా పెళ్లి చేసిన దంపతులను వై ఎన్ హెచ్ కోట వదలడానికి పిల్లలపల్లి గ్రామానికి చెందిన లోకేష్, చిట్టమ్మ, కృష్ణవేణి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ములకనూరు గేట్ దగ్గర రోడ్డుపై ఉన్న గుంతలో ఎగిరి పోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో వాహనంలో వెళుతున్న లోకేష్, చిట్టమ్మ, కృష్ణవేణి తీవ్ర గాయాలయ్యాయని వారు తెలిపారు.


ప్రమాదంలో గాయపడిన ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రుల్లో గాయపడిన వారికి చికిత్స చేసిన వైద్యులు వారికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. ప్రధాన రోడ్డుపై గుంత పడి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత అదే గుంతలో ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి అని వారు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అనంతపురంకు తరలించారని వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa