తమ మంత్రి పినపే విశ్వరూప్ పై ఆయన అనుచరలు తనదైన శైలీలో అభిమానాన్ని చాటుకొన్నారు. ఏపీలో వరుసగా రెండో పర్యాయం కూడా మంత్రి పదవిని దక్కించుకున్న వైసీపీ సీనియర్ నేత పినిపే విశ్వరూప్కు ఆయన అనుచరులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. మొన్నటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవిని దక్కించుకున్న తర్వాత తన సొంత నియోజకవర్గం అమలాపురం వెళ్లిన సందర్భంగా విశ్వరూప్కు ఆయన అనుచరులు కరెన్సీ నోట్లతో స్వాగతం పలికిన వైనం వైరల్గా మారింది.
పినిపే విశ్వరూప్ కాన్వాయ్ సమీపించగానే.. కరెన్సీ నోట్లను రోడ్డుపై చల్లుతూ ఆయన అనుచరులు వినూత్నంగా స్వాగతం పలికారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని నగరం మార్కెట్ కమిటీ చైర్మన్ తన జేబుల్లో నుంచి కరెన్సీ నోట్లను తీసి రోడ్డుపై చల్లారు. సదరు నోట్లను ఏరుకునేందుకు వైసీపీ శ్రేణులు పోటీ పడ్డాయి. అమలాపురం సమీపంలోని ఈదరపల్లి వంతెన వద్ద కనిపించిన ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa