జాతిపిత మహాత్మా గాంధీ బాపట్ల నియోజకవర్గంలో పర్యటించి నేటికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. 1929 ఏప్రిల్ 18న పూజ్య బాపూజీ బాపట్ల పట్టణంలో పర్యటించారు. భవనారాయన స్వామి దేవాలయం ఎదుట ఓ వేదికపై నుంచి ప్రసంగించారు. అక్కడి నుంచి కాలినడకన జమిందార్ రావూరి శ్రీశైలపతి నివాసానికి చేరుకున్నారు. హరిజనోద్ధరణ, ఖద్దరు, వస్రాల ఉద్యమాల పేరుతో విరాళాలు సేకరిం చారు. రావూరి శ్రీశైల దంపతులు ఓ బింది నిండా వెండి నాణేలను గాంధీజీకి విరాళంగా అందించారు.
గాంధీజీ ప్రసంగించిన ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన నడిచిన రోడ్డుకు మహాత్మా గాంధీ రోడ్డు గా నామకరణం చేశారు. బాపట్ల నుండి ఎడ్లబండిపై పిట్టలవానిపాలెం మండలం, మంతెనవారి పాలెం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి గ్రామ శివారులోని కనుమూరి వెంకట రాజు ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు.
ఆ ఇంట్లో మేడపై కూర్చొని స్వరాజ్య నిధికి విరాళాలు సేకరించారు. పాటిబండ్ల కోటమ్మ వాసిరెడ్డి రాజ్యలక్ష్మి అనే మహిళలు తమ ఒంటి మీద ఉన్న బంగారు నగలను గాంధీజీకి సమర్పించి స్వాతంత్రోద్యమానికి వన్నెతెచ్చిన వీరవనితలు గా పేరుగాంచారు.
కనుమూరి వెంకట రాజు దంపతులతో గ్రామంలో ని మంతెన వెంకటరాజు పలువురు దేశభక్తులు అధిక మొత్తంలో విరాళాలు అందించారు. ఆ రాత్రికి అక్కడే బస చేశారు. ఏప్రిల్ 19న మంతెనవారిపాలెం నుండి బయలుదేరి చెరుకుపల్లి మండలం కావూరు వినయ ఆశ్రమానికి చేరుకొని అక్కడ శంకుస్థాపన చేశారు. ఆశ్రమం ఆవరణలో చెట్లు నాటారు. ఈ విధంగా బాపూజీ బాపట్ల తాలూకాలో పర్యటించి స్వాతంత్రోద్యమానికి వన్నె తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa