దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,183 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. 214 మంది కోవిడ్ మహమ్మారి బారిన పడి మరణించారు. అందులో 213 మంది కేరళకు చెందిన వారే ఉన్నారు. మరొకరు యూపీలో మృతి చెందారు. కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో కేరళ నుంచి 940, ఢిల్లీ నుంచి 517 నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలోనే కోవిడ్ కేసుల్లో 90 శాతం పెరుగుదల నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఢిల్లీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గత 15 రోజుల్లో అక్కడ 500 శాతం మేర కేసులు పెరిగినట్లు కోవిడ్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ఒక్క రోజులోనే 2.66 లక్షల మంది దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa