రాజనీతిజ్ఞులు, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత నేత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని భారత ఉప రాష్ట్రపతి, బహుభాషా కోవిదులు ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం మచిలీపట్నంలో ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కృష్ణాజిల్లా పరిషత్తు చైర్మన్ గా స్వర్గీయ పిన్నమనేని కోటేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆత్మీయంగా పలుకరించి ఆయనతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాజిల్లా అభివృద్ధికి ఎనలేని కృషిచేసి, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన స్వర్గీయ పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa