ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల పై టీడీపీ నిరసన..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 04:01 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపుమేరకు కొండపల్లి పురపాలక ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలు, బస్ చార్జీలు, పెట్రోల్-డీజిల్, నిత్యావసర వస్తువుల పెరుగుదలపై రాష్ట్ర పార్టీ పార్టీ ఇచ్చిన "బాదుడే- బాదుడు"కార్యక్రమం నిర్వహించారు. 1వ, 3వ డివిజన్ల లో రాజీవ్ నగర్, బాలాజీ స్ట్రీట్, బషీర్ స్ట్రీట్, కొల్లి ఆదినారాయణ గారి స్ట్రీట్ లలో లాంతర్లు, ప్లేకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. 


ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికి ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచడం జరిగిందని దాదాపు 42 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేస్తూ నిధులు మళ్లీస్తున్నారని అలాగే ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతుందని , డీజిల్‌ సెస్‌ పేరుతో ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని వైసీపీ పాలనలో రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతివారం ఛార్జీలు, పన్నులు పెంచడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే చెత్త, ప్రాపర్టీపై పన్నుల భారం వేశారని పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని మండిపడ్డారు. 


ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులతో పాటుగా మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వరరావు గారు, కౌన్సిలర్లు శ్రీ లక్ష్మీ , భూలక్ష్మి, జ్యోతి, అరుణ కుమారి, అమ్మాజీ , గోపాలరావు మరియు నాయకులు సైదులు, సుంకర విష్ణు, దిలీప్, విజయ్ కుమార్, అఫ్సర్ , ప్రకాష్ , మాభూ, సత్యం, బసవ ఉమా, సాంబమూర్తి, వేమూరి అజయ్, భయ్య రాము, కొట్ల రాజు, డి. పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa