ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అవినీతి ఫిర్యాదుల కోసం 'ఏసీబీ' యాప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 05:06 PM

ఏపీలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ అవినీతి నిరోధక శాఖ యాప్ (ఏసీబీ యాప్‌) తేవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హోం శాఖపై సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఏసీబీకి యాప్‌ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్‌ రూపకల్పన చేయాలని ఆదేశించారు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని తెలిపారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ వ్యవహారాలకు ఏపీలో చోటు ఉండరాదని తెలిపారు. విద్యాసంస్థలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఉంటుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa