ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతోందా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:20 AM

ఒకపుడు వైసీపీలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తరువాత విజయసాయిరెడ్డి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇపుడు ఆ పరిస్థితి తారుమారైందని గుసగుసలు మొదలయ్యాయి. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ షాకిచ్చారు. విశాఖ పార్టీ బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించారు. ఆ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. సుబ్బారెడ్డికి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. ఉత్తరాంధ్రలో విజయసాయిపై పలు ఆరోపణలు రావడం, సొంత పార్టీ నేతలే అసంతృప్త స్వరాలను వినిపించడం తదితర పరిణామాల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 


మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించలేదు. విజయసాయికి ఇటీవలే పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పని చేయనున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ మరింత ప్రాధాన్యతను కల్పించారు. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa