ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలువ పై పలకలు విరిగిపడిన అధికారులు పట్టించుకోరా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:01 PM

పొందర వీధిలోకి వెళ్ళే దారిలో కాలువ పైన పలకలు విరిగిపడి వాహనాలు వెళ్లడానికి వీలు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, మున్సిపల్ సిబ్బంది అసలు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని, కాలువ పైన పలకలు కాలువలో పడటం వలన మురుగు ప్రవహించకుండా ఒకే దగ్గర నిల్వ ఉండడం వలన చుట్టుప్రక్కల దుర్గంధం వ్యాప్తి చెంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa