ప్రైవేటు వాహనంలో తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని రాత్రి పూట నడిరోడ్డుపై ఉంచేసి ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఆ వాహనాన్ని ఆర్టీఏ అధికారులు తీసుకువెళ్లడం దుర్మార్గపు చర్య అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఒంగోలు నగరంలో ఆర్టీఏ అధికారులు వినుకొండకు చెందిన శ్రీ వేముల శ్రీనివాస్ కుటుంబాన్ని ఇక్కట్లకు గురయ్యేలా ప్రవర్తించడాన్ని ఖండించారు. శ్రీ వేముల శ్రీనివాస్ కుటుంబంతో జనసేన నాయకులూ నాదెండ్ల మనోహర్ గురువారం అనగా ఈ రోజు ఉదయం ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీ వేమల శ్రీనివాస్ కుటుంబం తమకు ఎదురైన ఇబ్బందులను తెలియచేస్తూ తిరుమలకు వెళ్తున్నాం. పిల్లలు, మహిళలు ఉన్నారు అని చెప్పినా వినలేదు అని వాపోయారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ... ఇదో కొత్త తరహా పాలనలా ఉందని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa