ఆమెకు పెళ్లై పిల్లలున్నారు. కుటుంబాన్ని తన కష్టంతో నెట్టుకొస్తున్న భర్త బ్రతికే ఉన్నాడు. వారి బాగోగులను ఆ మహిళ పక్కన పెట్టింది. పక్కింట్లో ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండగా భర్త కంట పడ్డారు. దీంతో వివాహేతర సంబంధమే తనకు ముఖ్యమని భావించిన ఆ మహిళ తన భర్త పట్ల దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బీహార్ రాష్ట్రం పుర్నియ జిల్లా చకర్పద గ్రామానికి చెందిన పోషిత్ కుమార్కు సావిత్రిదేవితో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్నాళ్లుగా భర్తతో సావిత్రి సరిగ్గా ఉండడం లేదు. పక్కింట్లో ఉండే అరవింద్ మహల్దార్ అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది. కొన్ని రోజులకు అది వివాహేతర సంబంధంగా మారింది. పనికి వెళ్లిన పోషిత్ కుమార్ ఒకరోజు అనుకోకుండా మధ్యలోనే వచ్చేశాడు. ఇంట్లోకి రాగానే భార్య ఆమె ప్రియుడితో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉండడం చూశాడు. ఇక భర్తకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో సావిత్రి తెగించింది. భర్తను చంపేసేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.
వివాహేతర సంబంధం గురించి భార్యతో పోషిత్ గొడవ పడ్డాడు. అప్పటికే అతడిని అడ్డు తొలగించుకోవాలని సావిత్రి దేవి నిర్ణయించుకుంది ప్రియుడిని పిలిచి భర్త మెడకు ఇద్దరూ తాడు బిగించారు. ఊపిరి ఆడకుండే చేసి చివరికి ప్రాణం తీశారు. ఈ హత్యపై పోషిత్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. దీంతో సావిత్రి, అరవింద్ మహల్దార్ను శుక్రవారం వారు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa