ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటగాళ్లకు షాకిస్తున్న..స్లో ఓవర్ రేటు నిబంధన

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 11:26 PM

ఐపీఎల్ మ్యాచ్ లో ఆటగాళ్లకు స్లో ఓవర్ రేటు నిబంధన షాకిస్తోంది. ఇదిలావుంటే ప్రస్తుత ఐపీఎల్ 15వ సీజన్ లో.. ముంబై ఇండియన్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ రెండో సారి విజయం సాధించింది. దీంతో లక్నో జట్టు సంబరాల్లో మునిగిపోగా.. ఐపీఎల్ రిఫరీ ఫైన్ తో షాకిచ్చారు. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు రూ.24 లక్షల ఫైన్ విధించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలోపు 20 ఓవర్ల బౌలింగ్ ను లక్నో జట్టు పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా స్లో ఓవర్ రేటు కారణాన్ని చూపించి ఫైన్ విధించారు. ఈ సీజన్ లో లక్నో జట్టుకు ఇది రెండో విడత స్లో ఓవర్ రేటు. అందుకనే ఇంత ఫీజు పడింది.


మ్యాచ్ లో పాల్గొన్న లక్నో జట్టు మిగిలిన సభ్యులు అందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు ఏది తక్కువైతే అది చెల్లించాలని రిఫరీ ఆదేశాలు జారీ చేశారు. స్లో ఓవర్ రేటు నిబంధన ఈ విడత చాలా మందికి షాకిస్తోంది. నిబంధనల మేరకు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు చివరి ఓవర్ (20వ ఓవర్)ను 85వ నిమిషం ముగిసేలోపు తప్పనిసరిగా ప్రారంభించాలి. అంతకు ఆలస్యమైతే ‘స్లో ఓవర్ రేటు’ కింద జరిమానా పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa