ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ సరఫరా నిలించింది...మహిళా చనిపోయింది

national |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 09:48 PM

విద్యుత్ అకస్మాత్తుగా పోతే మనకు అంధాకారమే కనిపించవచ్చు...ఒక్కో సందర్భంలో మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. రాజస్థాన్‌లో ఘోరం చోటుచేసుకుంది. అక్కడ ఓ ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. కోటా సిటీలోని న్యూ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. ఆస్పత్రిలో వైద్యులు ఓ వృద్ధురాలికి చికిత్స చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది. దాంతో వెంటిలేటర్‌పై ఉన్న ఆమె పరిస్థితి మరింత దిగజారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అప్రమత్తమైన వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ఆమెకు మొబైల్ టార్చ్‌లైట్ వెలుతురులో చికిత్స చేశారు. ఓ డాక్టర్ రోగికి సీపీఆర్ కూడా చేశారు. కానీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.


దీంతో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందని ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రోగిని కాపాడ్డానికి చాలా ప్రయత్నించామని, తమ శాయశక్తులా కృషి చేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. విద్యుత్ వైఫల్యం వల్ల రోగి పరిస్థితి క్షీణించి చనిపోయిందని అంటున్నారు. విద్యుత్ అంతరాయం వల్ల ఆస్పత్రిలో చాలా మంది రోగుల పరిస్థితి ఇలానే ఉంది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉంది. అయితే చీకట్లో టార్చ్‌లైట్ వెలుగులో వైద్యం అందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa