జగన్ రెడ్డి హయాంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మహియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా... లాంటివి ఎన్నో చూస్తున్నాం. వాటిపేరిట జరిగిన దోపిడీని చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రజల రక్తాన్ని లంచాల రూపంలో తాగేస్తున్న హాస్పిటల్ మాఫియా ఒకటి బయటపడింది అని అంటున్నారు టీడీపీ నాయకులూ నారా లోకేష్ . ఆయన మాట్లాడుతూ... నిన్న తిరుపతి రుయా ఆసుపత్రి దగ్గర అంబులెన్స్ మాఫియాని చూసాం... ఈరోజు విశాఖపట్నం కెజిహెచ్ పిల్లల వార్డులోని లంచాల మాఫియా దుర్మార్గాన్ని చూడండి. అని ఒక వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. వివరాల్లోకి వెళ్ళితే పెనుకొండ, ఆస్టరాయివరం మండలం , ధర్మవరం చెందిన ఒక కుటుంభం చికిత్సా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి రాక , అక్కడ ఉన్న సిబ్బంది ప్రతి దానికి డబ్బు లేనిదే పని జరగడం లేదు అని వాపోయారు. మాకు బాబు పుడితే, 5000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవ్వను, ఇవ్వలేము అంటే, పుట్టిన బాబుని ఇవ్వం అని బుకాయించి , మా మీద దాడి చేసారు అని తమ భాధను వ్యక్తపరిచారు.
జగన్ రెడ్డి హయాంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మహియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా... లాంటివి ఎన్నో చూస్తున్నాం. వాటిపేరిట జరిగిన దోపిడీని చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రజల రక్తాన్ని లంచాల రూపంలో తాగేస్తున్న హాస్పిటల్ మాఫియా ఒకటి బయటపడింది. (1/2) pic.twitter.com/pyVIWjrfpA
— Telugu Desam Party (@JaiTDP) April 27, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa