ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 12:02 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఆ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల‌కు నిర‌స‌న‌గా టీడీపీ చేప‌ట్టిన బాదుడే బాదుడు నిర‌స‌న‌ల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గం ప‌రిధిలోని తాడేపల్లి టౌన్ డోలాస్ నగర్ ప‌ర్యటించిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్... అక్క‌డి ప్ర‌జ‌ల‌కు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు టీడీపీ శ్రేణులు గ‌జ‌మాల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. 


ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయిన నారా లోకేశ్...వారి స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. ఇళ్ల పట్టాలు, పారిశుధ్యం, తాగునీటి సమస్యలను ప్రజలు ఆయ‌న‌ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలు, ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయ‌న‌ పరామర్శించారు. గెలిచిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా ప్రజలపై కక్ష కట్టి ఇళ్లు కూల్చడం మొలద‌లెట్టార‌ని లోకేశ్ ధ్వ‌జ‌మెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa