ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతభత్యాలు ఇవ్వండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 11:39 AM

శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్న పోలీస్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చెయ్యడం సమంజసం కాదని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. తమ సేవలకు ప్రతిఫలంగా వచ్చే జీత భత్యాల మీద ఆధారపడే ఉద్యోగులను వేధించడం మానుకోవాలని సూచించారు. రైతాంగం, ఉద్యోగులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు అంశాలను గురించి ప్రస్తావిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. పోలీస్ శాఖలోని ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా జీత భత్యాలు సకాలంలో అందడం లేదని తెలిసింది. సగటు పోలీస్ ఉద్యోగి కుటుంబం సభ్యుడిగా సకాలంలో జీతభత్యాలు అందకపోతే చోటు చేసుకునే సమస్యలు తెలుసునని, అవి అనుభవించాం కాబట్టే అటువంటి సమస్యలు మరొకరికి రాకూడదని ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడాల్సి వస్తోందని స్పష్టతనిచ్చారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీకి రాజ్యాధికారం అప్పజెప్పాలని, శ్రీ పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలనే భావన అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోందని నాగబాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ బలమైన నిర్మాణం కోసం తన చివరి శ్వాస వరకు జన సైనికుడిగా పని చేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నిర్మాణం కోసం రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి రావడానికైనా సిద్ధంగా ఉన్నానని, జన సైనికులు, వీర మహిళలు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, ఏ విధమైన బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగొద్దు అని పిలుపునిచ్చారు. ఇక నుంచి నేను ప్రతీ జన సైనికుడికి, వీర మహిళకు అందుబాటులో ఉంటానని అత్యవసర సమయాల్లో అవసరం అనుకుంటే నన్ను సంప్రదించవచ్చనే ధైర్యానిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa