ఏపీలోని అనకాపల్లిలో దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. ఏకంగా పట్టపగలు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడు. హెల్మెట్ పెట్టుకుని వచ్చి క్యాష్ కౌంటర్లో ఉన్న నగదు మొత్తం పట్టుకెళ్లిపోయాడు. తుపాకీ చూసి బెదిరిపోయిన సిబ్బంది అతడు చెప్పినట్లే చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అనకాపల్లి సమీపంలోని నర్సింగబిల్లిలో గ్రామీన వికాస్ బ్యాంకుకు ఓ వ్యక్తి శనివారం హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు. వచ్చీ రావడంతోనే తుపాకీ చూపిస్తూ క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. క్యాషియర్ను బెదిరించడంతో ప్రాణభయంతో కౌంటర్లోని రూ.3 లక్షల నగదును దుండగుడికి అప్పగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నిందితుడు జారుకున్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమి శాలి రంగంలోకి దిగారు. హైవేతో పాటు ఇతర మార్గాల్లో గస్తీ ముమ్మరం చేశారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిందితుడు బీహార్, యూపీకి చెందిన వాడై ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa