ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా మాటలు వక్రీకరించి రాస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 03:00 PM

తల్లులను కించపరిచేలా హెడ్డింగ్ లు పెట్టి, అసలు తన నోటిలో నుండి రాని మాటను మాట్లాడినట్టుగా రాష్ట్రంలోని ఆడబిడ్డల తల్లులందరినీ అవమానపరిచి, కించపరిచింది ఆంధ్రజ్యోతే అని హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు, భావాలను వక్రీకరించి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపడానికి ఎల్లో మీడియా, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత  ఆరాటపడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.  ఆడపిల్లపై సొంత తండ్రి అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ప్రస్తావించి మాట్లాడుతున్నప్పుడు... ఇంట్లో ఆడపిల్లలపై అలాంటి సంఘటనలు జరగకుండా తల్లి కనిపెట్టుకుని ఉండాలని, ఆ బాధ్యత తల్లిపైనే ఉంటుందని ఓ తల్లిగా తాను మాట్లాడానని అన్నారు.ఎందుకంటే.. కొన్ని ఘటనలు చూసినప్పుడు, ఇంట్లో ఆడపిల్లపై సొంత తండ్రే అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ ఆడపిల్లని తల్లి కాకుండా ఇంకెవరు కాపాడగలరు..? అందుకే కన్నబిడ్డలను తల్లి మాత్రమే కాపాడగలదన్నది నా ఉద్దేశ్యం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa