కర్నూలు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెదేపా నేత, మాజీ ఎంపీపీ రాజవర్ధన్రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు.కర్నూలు నెహ్రూనగర్లో రాజవర్ధన్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాజవర్ధన్ తండ్రి, ఇతర కుటుంబసభ్యులను లోకేశ్ ఓదార్చారు.అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. రోడ్డుప్రమాదంలో రాజవర్ధన్లాంటి యువనాయకుడు, మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఏరోజూ ఆయన సొంత పనుల కోసం తనను కలవలేదని చెప్పారు. చిన్నవయసులోనే రాజవర్ధన్ చనిపోయారని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని లోకేశ్ ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa