బంగారం కొంటున్నారా...అయితే ఇలా చేయండి అన్న సలహాలు వస్తుంటాయి. తాజాగా అక్షయ తృతీయ పర్వదినం రానున్నది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనాలని లేదా ఏదైనా కొత్త వస్తువు తీసుకోవాలని చూస్తుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడమనేది ఆనవాయితీగా వస్తోంది. బంగారం, వెండి ఆభరణాలు కొనేందుకు కొందరు ఈ రోజు వరకు వేచిచూస్తారు. గోల్డ్ కాయిన్ల నుంచి ఆభరణాలు, డిజిటల్ గోల్డ్ వరకు దేనినైనా కొనేందుకు ప్రజలు మొగ్గు చూపుతారు. ఇటీవల కాలంలో గోల్డ్ కొనుగోళ్లలో చాలా మార్పులు వచ్చాయి. చాలా మంది ఫిజికల్ గోల్డ్కి బదులు గోల్డ్ ఈటీఎఫ్లను కొంటున్నారు. మనం ఇప్పుడు ఈ ఆర్టికల్లో అక్షయ తృతీయ సందర్భంగా ఫిజికల్ గోల్డ్ కొనడం మంచిదా లేదా గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం బెటరా.. అనేది తెలుసుకుందాం..
చాలా మంది నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఇటీవల కాలంలో డిజిటల్ గోల్డ్ ప్రాముఖ్యత పెరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు గోల్డ్ ఈటీఎఫ్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే గోల్డ్ ఈటీఎఫ్లు సురక్షితమైనవి. వీటిని నిల్వ చేయడం తేలిక, ఎవరూ దొంగలించలేరు లేదా వీటి విలువను మార్చలేరు. ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎలాంటి మేకింగ్ ఛార్జీలను మీరు చెల్లించాల్సినవసరం లేదు. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీ చేతిలో ఉన్న డబ్బుల మేరకే మీరు ఈ గోల్డ్ను కొనుగోలు చేయొచ్చు. అంటే మీ చేతిలో రూ.50 ఉంటే.. ఆ విలువ మేరకే గోల్డ్ ఈటీఎఫ్లలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఈ గోల్డ్ను కొనొచ్చు , ఎప్పుడైనా అమ్మొచ్చు. ఎలాంటి ఇబ్బందులుండవు. ఈ అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా మీరు ఎవరికైనా బంగారాన్ని గిఫ్ట్గా ఇవ్వొచ్చు, లేదా మీకు మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యూనిట్లు మెటీరియల్ రూపంలో ఉండవు.
కానీ ఫిజికల్ గోల్డ్ కొనాలంటే మాత్రం మీ దగ్గర కచ్చితంగా కనీస పెట్టుబడి ఉండాలి. అంటే ఒక తులం బంగారం కొనాలంటే కచ్చితంగా రూ.50 వేల పైనే మీ వద్ద డబ్బులుండాలి. కానీ గోల్డ్ ఈటీఎఫ్ల విషయంలో అలాంటి షరతులేమీ లేవు. కంపెనీ షేర్లు మాదిరి గోల్డ్ ఈటీఎఫ్లు కూడా స్టాక్ ఎక్స్చేంజ్లలో ట్రేడవుతూ ఉంటాయి. వీటిని మీరు ఆన్లైన్గానే కొని అమ్మొచ్చు. 100 శాతం స్వచ్ఛమైన గోల్డ్నే ఇన్వెస్టర్లకు లభిస్తుంది. సిప్ ద్వారా కూడా దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు. దేశవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్లకు ఒకే ధర ఉంటోంది. కానీ ఫిజికల్ గోల్డ్ ధరలు ప్రాంత ప్రాంతానికి మారుతూ ఉంటాయి. ఎవరైన ఫిజికల్ గోల్డ్ కొంటే బంగారంతో పాటు మేకింగ్ ఛార్జీలను కూడా చెల్లించాలి. ఈ మేకింగ్ ఛార్జీలే 25 శాతం నుంచి 30 శాతంగా ఉంటాయి. కానీ గోల్డ్ ఈటీఎఫ్లలో ఇలాంటి ఛార్జీలుండవు. బంగారం ధరతో పాటు కేవలం 1 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్లలో రూ.50 విలువైన బంగారాన్ని కూడా కొనొచ్చు. ఏ సమయంలోనైనా దీనిని కొనవచ్చు, అమ్మవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa