ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు వ్యవస్థపైనే ప్రభావం చూపుతున్న క్రిప్టో కరెన్సీ

business |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 04:03 PM

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకపుడు మంచి డిమాండ్ ఉండేది. కానీ ప్రైవేటు రంగంలో వచ్చిన మార్పులతో భారీ వేతనాల వల్ల ఇపుడు పరిస్థితులు తారుమారయ్యాయి. తాజాగా క్రిప్టో కరెన్సీ సంస్థలు యూకే సైబర్ క్రైమ్ పోలీసులకు భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. తమ సంస్థలలో చేరితే ఇప్పటికే వచ్చే వేతనం కంటే రెండింతలు లేదా మూడింతలు ఎక్కువ వేతనాన్ని చెల్లిస్తామని క్రిప్టో సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అనుభవజ్ఞులైన సైబర్ క్రైమ్ ఆఫీసర్లను తాము కోల్పోవాల్సి వస్తుందని యూకే దళాలకు చెందిన నేషనల్ పోలీసు చీఫ్ కౌన్సిల్(ఎన్‌పీసీసీ) వాపోయింది. పోలీసింగ్ లేదా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో నిపుణులైన సుమారు 15 మందికి పైగా ఆఫీసర్లు ప్రస్తుతం ప్రముఖ క్రిప్టో సంస్థలలో పనిచేస్తున్నారని ఎన్‌పీసీసీ అంచనావేసింది. వచ్చే ఏడాదిలో లేదా 18 నెలల కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, తమకు సైబర్ క్రైమ్ నిపుణులు తగ్గిపోతారని పేర్కొంది.


అనుభవజ్ఞులైన సైబర్ క్రైమ్ ఆఫీసర్లను లేదా ఉద్యోగులను కోల్పోవడం తమకు అతిపెద్ద సమస్యగా మారనుందని ఎన్‌పీసీసీ సైబర్‌ క్రైమ్ యూనిట్ హెడ్ ఆండ్రూ గౌల్డ్ చెప్పారు. ప్రైవేట్ రంగంలో వీరి నైపుణ్యాలకు భారీగా డిమాండ్ ఉందని, రెండింతలు లేదా మూడింతలు ఎక్కువగా ప్యాకేజీలను ఆఫర్ చేస్తుండటంతో ఆఫీసర్లు క్రిప్టో సంస్థలలో చేరుతున్నారని పేర్కొంది.


తమ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్టాఫ్‌ను నియమించుకుంటోన్న సంస్థలలో అమెరికాలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజీ అయిన కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంక్, క్రిప్టో రీసెర్చ్ సంస్థ చైనాలిసిస్ ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజీ అయిన బినాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ కూడా యూకే ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీకి చెందిన మాజీ అధికారిని తన రెగ్యులేటరీ పాలసీకి డైరెక్టర్‌గా నియమించుకుంది. తమ కస్టమర్ల ఫండ్‌ను సురక్షితంగా, భద్రంగా ఉంచేందుకు వారు సమగ్రమైన పాత్ర పోషిస్తారని కాయిన్‌బేస్ అధికార ప్రతినిధి చెప్పారు.


2018 నుంచి సుమారు 250 మంది నిపుణులకు ప్రభుత్వ ఫండ్‌తో సైబర్ సెక్యూరిటీల విషయంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్‌లో వీరికి క్రిప్టో కరెన్సీల హ్యాక్‌ల వంటి క్రైమ్‌లను ఎలా విచారించాలో నేర్పించారు. కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద క్రిప్టో ఎక్స్చేంజీలన్ని శిక్షణ ఇప్పించుకున్న సైబర్ నిపుణులను తమ వైపుకు ఆకర్షించుకుంటున్నాయి. వారికి భారీ వేతనాలతో తమ సంస్థలలో నియమించుకుంటున్నాయి. 2018 నుంచి ఎక్స్చేంజీలకు కూడా హ్యాకర్ల నుంచి ముప్పు పెరిగింది. దీంతో డిజిటల్ సెక్యూరిటీలో అత్యధికంగా క్వాలిఫై అయిన నిపుణుల అవసరం వాటికి పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa