రాష్ట్రంలో రౌడీ కామాంధుల ఆగడాలు ఎక్కువయ్యాయని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిది దానబోయన సుందరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లి లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ కామాంధుల ఆగడాలు ఎక్కువయ్యాయని మొన్న తుమ్మపూడిలో జరిగిన అత్యాచార ఘటన మరువక ముందే రేపల్లె రైల్వే స్టేషన్ లో దళిత గర్భిణీ మహిళ పై తన భర్త, పిల్లల ముందే ముగ్గురు కామాంధులు హత్యాచారం చేశారని అన్నారు. హత్యాచారం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల మీద అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని అన్నారు. దీనికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ముద్దాయిలను సపోర్టు చేస్తున్న ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.
మేరుగ నాగార్జున ఎస్సీ శాఖ మంత్రి అయ్యుండి ఎస్సీ ల మీద దాడులు అధికంగా జరుగుతుంటే ముద్దాయిల పక్షాన సపోర్ట్ చేయడం వలన ఎస్సీ, ఎస్టీ, బిసి అత్యాచార ఘటనలు ఎక్కువ అయ్యాయని అన్నారు. అంతా చేసి టిడిపి వారు చేయించారని చెప్పటం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ నాయకులు పరామర్శకు వెళితే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని దానబోయిన సుందరరావు యాదవ్ డిమాండ్ చేశారు. తాడికొండ నియోజక వర్గం లామ్ లో వడ్డెర కులానికి చెందిన మహిళని దుర్భాషలాడి భార్య భర్త ల పై దాడి చేసి దౌర్జన్యం చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్సి, బిసి నాయకుల కుల సంఘాలను సమావేశపరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa