ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రిని కంగారు పెట్టించిన ఎలుక

national |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 05:08 PM

రాజకీయాల్లో ఎవరైనా వార్డు మెంబర్‌గా గెలిచినా, వారి హడావుడి మామూలుగా ఉండదు. తమకు తిరుగులేదని, ఎవరు అడ్డొచ్చినా ఊరుకునేది లేదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఇక ఎమ్మెల్యేగా గెలిస్తే వారి హోదా మామూలుగా ఉండదు. అవసరమైతే ఏదైనా లాభం ఉందనుకుంటే రాత్రికి రాత్రే ఇతర పార్టీలోకి దూకేస్తారు. అందులోనూ మంత్రి హోదాలో ఉంటే, వారు రాజులా ఫీల్ అవుతారు. ఆ స్థాయిలో ఉన్న వారిని ఎవరైనా ఏమైనా అనాలంటేనే భయపడతారు. ఎంతైనా మంత్రి కాబట్టి, అధికారం ఉపయోగించి తమనేమైనా చేస్తాడని వెనుకంజ వేస్తుంటారు. అధికారులైతే వారి అడుగులకు మడుగులొత్తుతారు. అలాంటి వ్యక్తిని ఓ ఎలుక హడలెత్తించింది. ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాద‌వ్‌కు ఆ రాష్ట్రంలోని బాందా ప్రాంతంలో సోమవారం పర్యటించారు. రెండు రోజుల పర్యటన పూర్తవడంతో ఓ గెస్ట్ హౌస్‌లో కునుకు తీశారు. ఇంతలో తన కాలును ఏదో కొరికినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే గాట్లు కనిపించాయి. దీంతో తీవ్ర ఆందోళనతో, ప్రాణం పోయిందనే భయంతో విలవిల్లాడిపోయారు. చివరికి ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. తీరా అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయన గాయాన్ని వైద్యులు మరోసారి పరిశీలించారు. అది పాము కాటు కాదని, ఎలుక కొరికిందని నిర్థారించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో మంత్రి ఊరట చెందారు. కొద్ది సేపట్లోనే ఆయన ఆరోగ్యం కుదుట పడింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఎలుకపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa