ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 12:43 PM

ఏపీ సీఎం జగన్ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేయనున్నారు.


జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. తిరుపతి ఎస్వీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. అక్కడే జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద జగన్‌ సర్కార్ రూ.10,994 కోట్లు సాయంగా అందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa