ఏపీలో వరుసగా టెన్త్ పరీక్ష పత్రాలు లీక్ అవడం సంచలనంగా మారింది. పరీక్షలు ప్రారంభమయ్యాక పేపర్లు బయటకు వచ్చాయని, వాటిని మాల్ ప్రాక్టీస్గానే భావిస్తామని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఏపీలోని రెండు విద్యాసంస్థల నుంచే పేపర్లు లీక్ అవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు పేపర్ లీక్కు పాల్పడుతున్నాయని చెప్పారు. గురువారం తిరుపతిలో 'జగనన్న విద్యాదీవెన' నిధులను ఆయన విద్యార్థుల తల్లుల ఖాతాలే వేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నాపత్రాల లీక్ వెనుక కుట్ర ఉందని సీఎం జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
నారాయణ స్కూల్ నుంచి రెండు పేపర్లు, శ్రీ చైతన్య స్కూల్ నుంచి మూడు పేపర్లు లీక్ అయ్యాయని సీఎం జగన్ చెప్పారు. నారాయణ విద్యాసంస్థలు ఎవరిలో అందరికీ తెలుసుని వ్యాఖ్యానించారు. దొంగలే దొంగతనం చేసి, ఏదో జరిగిపోయిందని హడావుడి చేస్తున్నారని అన్నారు. వాట్సాప్ ద్వారా టెన్త్ పేపర్లు లీక్ చేసి, ఏదో జరిగిపోతుందని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa