ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ ప్రాంతాల వారికీ వివత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 05:50 PM

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడనున్నాయని ఏపీ వివత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో గురువారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో ఉన్నవారు వెంటనే ఇళ్లకు చేరుకోవాలని, బయట ఉండొద్దని పేర్కొంది.

పశువుల కాపరులు, రైతులు, కూలీలు వెంటనే సురక్షితమైన భవనాలలో తలదాచుకోవాలని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని సర్వకోట, పాతపట్నం, హీరా మండలం, లక్ష్మీనర్సుపేట మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లె, రాజవొమంగి, జి. మాడుగుల, జికె వీధి, కొయ్యూరు, డుంబ్రిగూడ, పాడేరు, హుకుంపేట, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి, నాతవరం, చీడికాడ, మాడుగుల, గొలుగొండ మండలాలు, విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట(ఎస్.కోట), వేపాడ, గంట్యాడ మండలాలలో పిడుగులు పడే అవకాశం ఉందని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa