ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 05:56 PM

విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్‌ను విశాఖలోని ఎండాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బీచ్ రోడ్డు నుంచి వెళ్లాల్సిన ఆయన కాన్వాయ్‌ను ఎండాడకు పోలీసులు మళ్లించారు. అక్కడ ముందుగానే 200లకు పైగా పోలీసులు మోహరించి చంద్రబాబుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన రుషికొండలో కూల్చివేసిన రిసార్ట్‌లను పరిశీలించేందుకు ఆయన వెళ్లాల్సి ఉంది. ముందుగానే టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. వందల సంఖ్యలో కార్యకర్తలు ఆయనతో పాటు నిరసన చేపట్టేందుకు తరలి వచ్చారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పార్టీ తరుపున చేపట్టనున్న వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. మరోవైపు తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎండాడలో భారీగా కార్యకర్తలతో తరలి వచ్చి నిరసన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa