రాజస్థాన్లోని జోధ్పూర్, కరౌలీలో జరిగిన మత ఘర్షణలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదివారం డిమాండ్ చేశారు.ఈ ఘర్షణలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బిజెపిపై చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఈ సంఘటనల వెనుక ఎవరున్నారో సిబిఐ విచారణలో స్పష్టమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు.ఈద్-ఉల్-ఫితర్కు ముందు, స్వాతంత్ర్య సమరయోధుడు బల్ముకుంద్ బిస్సా విగ్రహం పక్కన ఉన్న జలోరీ గేట్ సర్కిల్పై ఇస్లామిక్ జెండాలను ఏర్పాటు చేయడంపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరశురామ జయంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కాషాయ జెండా కనిపించకుండా పోయిందని ఇతర వర్గాలకు చెందిన వారు ఆరోపించారు.ఈ సమస్య రాళ్లదాడి, ఘర్షణలకు దారితీసింది.జోధ్పూర్లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 250 మందికి పైగా అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa