మహేంద్రసింగ్ ధోనీను పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసంలో ముచ్చెతాడు. మహేంద్ర సింగ్ ధోనీ పట్ల నమ్మకాన్ని షోయబ్ అక్తర్ వ్యక్తం చేశాడు. ‘‘అతడు ఎంఎస్ ధోనీ. ఆయన ఏం చేస్తాడన్నది నిజంగా ఊహించలేము. ఏదైనా బిన్నంగా చేయగలడు. ఆ విషయంలో అతడు ప్రసిద్ధుడు. గొప్ప వ్యక్తి కూడా. మేమంతా అతడ్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. వ్యక్తిగతంగా అయితే ధోనీ మరో సీజన్ పాటు ఐపీఎల్ లో ఆడతాడని అనుకుంటున్నాను. లేదంటే మేనేజ్ మెంట్ లో భాగం కావచ్చు’’అని షోయబ్ అక్తర్ ఓ స్పోర్ట్స్ పత్రికకు చెప్పాడు.
ధోనీ వచ్చే సీజన్ కు కూడా తనను చెన్నై జెర్సీలో చూస్తారని ప్రకటించడం తెలిసిందే. కాకపోతే తాను మైదానంలో ఆడేదీ, లేదంటే జట్టు మేనేజ్ మెంట్ లో భాగంగా డగౌట్స్ లో కూర్చొనేదీ ధోనీ ప్రకటించలేదు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సీజన్ కు ముందు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం, రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. కానీ, ఇచ్చిన బాధ్యతల్లో జడేజా తాను నిరూపించుకోలేకపోయాడు. బ్యాటింగ్ ఫామ్ కూడా కోల్పోయాడు.
8 మ్యాచులకు రెండింట్లోనే విజయం సాధించిన క్రమంలో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోనీ తిరిగి ఆ బాధ్యతలను స్వీకరించి అన్ని విషయాలపై దృష్టి సారించడం తెలిసిందే. పైగా కెప్టెన్ గా ధోనీ మూడు మ్యాచుల్లో రెండింటిలో గెలిపించాడు.
‘‘చెన్నై ఆరంభంలోనే డకౌట్ కావడం చాలా అరుదు. ప్రతి సీజన్ పై వారి ప్రభావం ఉంటుంది. సీఎస్కేకు ఈ విడత కిచెన్ లో వండేందుకు ఎంతో మంది కుక్కులు ఉన్నారు. తిరిగి గ్రూపుగా ఫామ్ అయ్యేందుకు వారికి సమయం కావాలి. ఈ సీజన్ లో ఇప్పటికే ఆలస్యం అయింది. స్పష్టమైన ఆలోచన, విధానంతో వచ్చే సీజన్ కు వారు మరింత బలంగా వస్తారు’’అని అక్తర్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa