ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ తవ్వకాలను ఆపండి: నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ధర్మాసనం ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 02:18 PM

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ముఖ్యమంత్రికి గెస్ట్ హౌస్ కట్టాలనే ఉద్దేశంతో విశాఖ సముద్రానికి ఆనుకుని ఉన్న రిషికొండపై కట్టడాలను పడగొట్టి... కొండపై భారీ ఎత్తున తవ్వకాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రుషికొండపై తవ్వకాలను తక్షణమే ఆపేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తవ్వకాలపై స్టే విధించింది. తాము తదుపరి ఉత్తర్వులను ఇచ్చేంత వరకు తవ్వకాలను చేపట్టకూడదని ఆదేశించింది. 


వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ పై ఈ నెల 6న ఎన్జీటీ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇప్పటి వరకు రుషికొండలో జరిపిన తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ కోస్టల్ జోన్, ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ మేనేజ్ మెంట్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నోడల్ ఏజెన్సీగా ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ వ్యవహరిస్తుందని తెలిపింది.  నెల రోజుల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa