ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీరాన్ని తాకి తీవ్ర వాయుగుండంగా మారిన 'అసని' తుఫాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 09:02 PM

కొన్ని రోజులుగా ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేసిన 'అసని' తుఫాన్ ఎట్టకేలకు తీరాన్ని తాకింది. కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను వద్ద బుధవారం సాయంత్రం తీరాన్ని తాకి, ఆ తర్వాత బలహీన పడడంతో తీవ్ర వాయుగుండంగా మారిపోయింది. అనంతరం ఈ తీవ్ర వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతోంది.


ప్రస్తుతం మచిలీపట్నానికి 21 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. రాత్రికి క్రమంగా 'అసని' తీవ్ర వాయుగుండం నుంచి బలహీనపడి వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించింది. నర్సాపురం, పాలకొల్లు, అమలాపురం, యానాం, కాకినాడ మీదుగా సముద్రంలోకి వెళ్లి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ వివరించింది. దీంతో కోస్తాంధ్ర తీరప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వాహణ శాఖ సూచించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే రెడ్‌అలర్ట్ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa