ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు

national |  Suryaa Desk  | Published : Sun, May 15, 2022, 05:55 PM

రాజస్థాన్ లో జరిగిన చింతన్ శిబిర్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 6 కమిటీలు ఇచ్చిన ప్రతిపాదనలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.


కాంగ్రెస్ కీలక నిర్ణయాలివే..


- ఒక కుటుంబానికి ఒక టికెట్


- 50 ఏళ్ల లోపు నాయకులకు పార్టీలో 50 శాతం పదవులు


- పార్టీ పదవుల్లో 5 ఏళ్లు కొనసాగింపు, తర్వాత మూడేళ్లు విరామం


- మొత్తం 20 ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదం


- కేరళ తరహాలో పార్టీకి జాతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం


- కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయపడేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం


- ఉదయ్​పుర్ డిక్లరేషన్​ కు ఆమోదం


- అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలకాలని నిర్ణయం.


- పేపర్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa