ఎస్. రాయవరం మండలం వమ్మవరం సచివాలయంలోడ్వాక్రా మహిళలకు దిశ యాప్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించినట్లు వెలుగు ఏపిఎమ్ శ్రీనువాస్ తెలిపారు. గురువారం ఉదయం వమ్మవరం సచివాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్థానిక యస్ ఐ శ్రీనువాస్ దిశ యాప్ ఆవశ్యకతను తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ చట్టం మహిళలకు వరమన్నారు. ప్రతి ఒక్క మహిళ దిశ చట్టంపై అవగాహన కలిగి వుండడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లు వున్న మహిళలకు దిశ యాప్ డౌన్ లోడ్ చేపించి, చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ పి ఎం. ఎస్. శ్రీనివాసరావు. సీసీ తాతయ్యలు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వెలుగు. వి ఓ ఏ లు. పార్వతి, కుమారి, దేవి హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa