టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దావోస్ లో దర్శనమిచ్చారు. ఓ పొలిటిషన్ అందులోనూ అధికారంలో లేని పార్టీ ఎంపీకి దావోస్ లో ఏంటి పని అనుకొంటున్నారా...? అయితే ఆయన రాజకీయ నేతనే కాదు ఓ వ్యాపారవేత అన్నది మనం మరవకూడదు. అందుకే ఆయన దావోస్ దర్శనమిచ్చారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులోనే గల్లా జయదేవ్ మెరిసారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజంగానే ఎంపీ దావోస్ వెళ్లారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దావోస్లోని ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు ట్విట్టర్లో జయదేవ్ ఫోటోను షేర్ చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసినట్లు తెలిపారు.
గల్లా జయదేవ్ తన ట్వీట్లో ఎనర్జీ రంగానికి చెందిన పలు పరిశ్రమల ప్రతినిధి బృందాలతో భేటీ కోసమే తాను ఈ సదస్సుకు హాజరైనట్లు తెలిపారు. ‘ఎనర్జీ అవుట్లుక్.. ఓవర్కమ్ ద క్రైసిస్’ చర్చలో పాల్గొన్నానంటూ ట్వీట్ చేశారు. గల్లా కుటుంబం వ్యాపారరంగంలో కూడా ఉంది. వీరికి అమరరాజా బ్యాటరీస్ సంస్థ ఉంది. ఆ కంపెనీ తరపున పారిశ్రామికవేత్తగా దావోస్ వెళ్లారు. ఎంపీ గల్లా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. ఏపీ నుంచి ఈ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్రెడ్డితో పాటూ పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. రెండు రోజులుగా పలువురు ప్రముఖులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీమ్ సమావేశం అవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తోంది. ఈ నెల 26 వరకు ఈ సదస్సు కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa