ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూసుకెళ్తున్న....వైసీపీ బస్సు యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 03:38 PM

జనంలోకి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసే ఉద్దేశంతో తలపెట్టిన మంత్రుల బస్సు యాత్ర జనంలోకి దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ ప్రజలకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ యాత్ర ముందుకు సాగుతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మూడో రోజు ప్రారంభమైంది. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పల్నాడు జిల్లా నర్సారావుపేట వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం పోలీస్ ఐ ల్యాండ్ వద్ద శనివారం ఉదయం 9 గంటలకు దివంగత వైఎస్సార్, ఇతర నేతల విగ్రహాలకు మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై, 10.00 గంటలకు నారాయణపురం, 10.45కు ఏలూరు బైపాస్ మీదుగా 11.30 కి గన్నవరం చేరుకున్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం జరుగుతోందన్నారు. కేబినెట్‌లో 17 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. తామంతా సీఎం జగన్‌ తయారు చేసిన సైనికులమని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీపై మంత్రి నాగార్జున నిప్పులు చెరిగారు.


టీడీపీ రథ చక్రాలు ఊడిపోయాయని మంత్రి మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదాన్ని మంత్రి తిప్పికొట్టారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని వ్యాఖ్యానించారు. అందుకే 2019 ఓడిపోయాక హైదరాబాద్ వెళ్లి పోయారని ఎద్దేవా చేశారు.


అలాగే, లంకెలపాలెంలో తమ యాత్రకు వచ్చినంత మంది కూడా మహానాడుకు రావటం లేదన మంత్రి మేరుగు నాగార్జున వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై సెటైర్లు వేశారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటారని.. కానీ, ఫ్లెక్సీల్లో కనీసం అచ్చెన్నాయుడు ఫోటోలు కూడా లేవని సెటైర్లు వేశారు. అచ్చెన్న ముందు ఆ సంగతేంటో చూసుకుంటే మంచిదని హితవు పలికారు. అలాగే, అమలాపురం ఘటనకు కారకుడు చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. అనంతరం మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎవరూ సామాజిక న్యాయం పాటించలేదు వ్యాఖ్యానించారు. దేశం మొత్తం మీద సామాజిక న్యాయం పాటించిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa